టెలికం రంగంలో సంచలనం రేపిన జియో..ఇప్పుడు ఫైబర్ సేవలు అందించబోతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ఈ సేవలు సెప్టెంబరు 5 నుంచి అందుబాటులోకి రానున్నట్లు అధినేత ముకేశ్ తెలిపాడు. సోమవారం జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ మాట్లాడుతూ.. ‘సెప్టెంబరు 5 నాటికి జియో ఆవిష్కరించి మూడేళ్లు పూర్తవుతుంది. అదే రోజున జియో ఫైబర్ సేవలను కమర్షియల్ బేసిస్లో ప్రారంభిస్తాం’ అని తెలిపారు. 1600 నగరాల్లోని 2కోట్ల నివాసాలు, 1.5కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్ను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపి అందరిలో ఆనందం నింపారు.
ఇక జియో ఫైబర్ ఫీచర్ల విషయానికి వస్తే..
* జియో ఫైబర్ ద్వారా 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ వరకు డేటా.
* ప్రీమియం జియో ఫైబర్ కస్టమర్లు సినిమా విడుదలైన రోజే తమ ఇంట్లో చూసుకోవచ్చు. ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’గా పిలిచే ఈ సేవలను 2020 మధ్యలో అందుబాటులోకి తీసుకొస్తాం.
* ప్రజలందరికీ అందుబాటు ధరల్లో జియో సేవలు. జియో ఫైబర్ సేవలు నెలకు రూ. 700 నుంచిరూ. 10వేల వరకు ఉంటాయి.
* జియో ఫైబర్ ద్వారా భారత్లోని ఏ టెలికాం ఆపరేటర్కైనా ఇంటి నుంచే ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఉచిత సేవలు జీవితకాలం ఉంటాయి.
* జియో నుంచి నెలకు రూ. 500తో అమెరికా, కెనడాకు అపరిమిత కాలింగ్ ప్యాకేజీ.
* ప్రారంభ ఆఫర్ కింద ఫరెవర్ వార్షిక ప్లాన్ తీసుకునే జియో ఫైబర్ కస్టమర్లు హెచ్డీ/ 4కే ఎల్ఈడీ టీవీ, సెట్టాప్ బాక్సును ఉచితంగా తీసుకోవచ్చు