ఎక్కువ డేటా వాడే వినియోగదారులకు జియో సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది..

ప్రముఖ టెలికం సంస్థ జియో ..ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త ప్లాన్లను తీసుకొస్తూ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే పలు డేటా ఆఫర్లను అందించిన జియో ..ఇప్పుడు ఎక్కువ డేటా వాడే వారికీ సరికొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. లాంగ్ టర్మ్ టారిఫ్ ప్లాన్ తో రూ.4,999 ఒకేసారి రీఛార్జ్ చేస్తే ఏకంగా 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. లాంగ్ టర్మ్ యూజర్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగదాపడుతుందని సంస్థ చెపుతుంది .

ఇక ఈ ప్లాన్‌లో 360 రోజులకు మీకు 350 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఈ డేటాను మీరు ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అంటే ఓరోజు 500 ఎంబీ, మరో రోజు 1 జీబీ, ఇంకో రోజు 2జీబీ… ఇలా మీకు ఏ రోజు ఎంత అవసరం అయితే అంత డేటా ఉపయోగించుకోవచ్చు. మీకు 360 రోజులకు 350 జీబీ 4జీ డేటా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ప్లాన్ ను యాక్టివ్ చేసుకొని ఫుల్ గా మీకు కావాల్సిన సినిమాలు చూసెయ్యండి.