మహీంద్రా నుండి టీయూవీ 300 వచ్చేసింది…

TVU300ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా కంపెనీ నుండి కొత్త టీయూవీ 300ను మార్కెట్ లో ప్రవేశ పెట్టారు. ఈ వాహనాన్ని పుణెలోని ఉత్పత్తి కేంద్రంలో మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆవిష్కరించారు. ఈ వాహనం ప్రారంభ ధరను రూ.6.90 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ ధర రూ.9.12 లక్షలు. ఈ టీయూవీ లో ఏడుగురు కూర్చోవడానికి వీలుండే రెడీ చేసారు. అంతే కాదు లీటర్ డీజిల్‌కు 18.49 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే విదంగా దీనిని రూపొందించారు.

మొత్తం మూడు రకాలు, ఏడు రంగుల్లో ఈ వాహనం లభించనుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న వాహనాలతో పోలిస్తే టీయూవీ 300 తక్కువ ధరకే లభించనుండటంతో డిమాండ్ అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు.