ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మొబిస్టార్..తాజాగా మొబిస్టార్ ఎక్స్1 నాచ్ పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,499 లతో , 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,499 లుగా నిర్ణయించింది.
ఇక ఈ ఫోన్ లో 5.7 ఇంచుల భారీ డిస్ప్లేతో పాటు డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ ఫీచర్ను ఈ ఫోన్లో కలిగి ఉండడం విశేషం. అలాగే ముందు, వెనుక భాగాల్లో 13 మెగాపిక్సల్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
మరిన్ని ఫీచర్లు చూస్తే..
* 5.7 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
* 1498 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్
* 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్
* 13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు
* డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.