ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఏసీ నడవాల్సిందే..ఏసీ కి అలవాటు పడినవారు ఒక్క క్షణం కూడా బయట ఉండలేరు..మరి బయటకు వెళ్ళినప్పుడు ఎలా..? అందుకే ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సోనీ పాకెట్ ఏసీ ను తయారుచేసింది.
బ్యాటరీతో నడిచే ఈ పాకెట్ ఏసీ స్మార్ట్ఫోన్ ద్వారా బ్లూటూత్ ఉపయోగించి నియంత్రిచొచ్చు. బ్లూటూత్ 5.0తో ఇది పనిచేస్తుంది. రెండు గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 90 నిమిషాల పాటు వాడుకోవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా లోపల ధరించే టీషర్ట్ను కూడా సోని తీసుకొచ్చింది. ఇక దీని ధర వచ్చేసి అక్షరాల 14,080 యెన్లు అంటే మన కరెన్సీ ప్రకారం రూ.8,992 అన్నమాట. ప్రస్తుతం ఇది జపాన్లో మాత్రమే లభ్యమవుతోంది..మన దగ్గర ఎప్పుడు తీసుకొచ్చేది తెలియాల్సి ఉంది.