ద్విచక్ర వాహన దారులకు ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ అందించే సుజుకి..తాజాగా మరో సరికొత్త బైక్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 155 సీసీ జిక్సర్ లో కొత్త వేరియంట్ను ప్రవేశపెట్టింది. యాంటీ – లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్)తో తయారుచేసిన ఈ బైక్ రూ. 87,250 ధరకు వినియోగదారులకు అందిస్తుంది.
ఈ బైక్ ప్రత్యేకతలు చూస్తే..
* 155 సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ పెట్రోలు ఇంజిన్
* 8,000ఆర్పీఎం వద్ద 14.8హెచ్పీ
* 6,000ఆర్పిఎం వద్ద14ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
* ఇంజిన్ను సమర్థవంతంగా, వేగంగా చల్లబరిచేందుకు సుజుకి జెట్ కూలింగ్ సిస్టమ్ వంటివి ఈ బైక్ లో ఉన్నట్లు సంస్థ చెపుతుంది.