సోషల్ మీడియా మాధ్యమం లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వాట్సాప్ ..ఇప్పుడు ఎక్కడ చూసిన చిన్న , పెద్ద తేడలేకుండా అందరూ వాట్సాప్ లో మునిగితేలుతున్నారు..ఇక ఇలాంటి వారి కోసం వాట్సాప్ లో మరో రెండు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. గ్రూప్ చాట్లలో లైవ్ లొకేషన్ ఫీచర్ను వాట్సాప్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో గ్రూప్ సభ్యుల్లో ఎవరు ఎక్కుడున్నారో మిగిలిన వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. సభ్యులంతా ఒకచోట కలుసుకోవాలని అనుకున్నప్పుడు ఎవరెంత దూరంలో ఉన్నారో తెలుసుకోడానికి ఇది బాగా ఉపయోగపడనుంది.
ఈ ఫీచర్ కోసం గ్రూప్లోకి వెళ్లి ‘షో మై ఫ్రెండ్స్’అనే ఆప్షన్ ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో ఫీచర్ విషయానికి వస్తే వినియోగదారులు ఒకసారి పంపిన సందేశాలను కూడా మళ్లీ వెనక్కు తీసుకుని మార్పులు చేసి పంపొచ్చు. అయితే సందేశాన్ని పొందిన వ్యక్తి అప్పటికి దానిని చదివి ఉండక పోతేనే ఇది కుదురుతుంది. వాట్సాప్ ఫీచర్లను ఎప్పటికప్పుడు తెలియజేసే @WABetaInfo అనే సంస్థ ఈ వివరాలను అందించింది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ రెండు ఫీచర్లను యాక్టివేట్ చేసుకోండి.