మొబైల్ వినియోగదారులకు అతి తక్కువ ధరకే, అత్యధిక ఫీచర్స్ తో ఆకట్టుకుంటూ వస్తున్న చైనా కంపెనీ షియోమి తాజాగా తన ప్రీమియం బ్రాండ్ ఎంఐ సిరీస్లో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ను తీసుకొస్తోంది. షియోమి ఎంఐ 6 పేరిట మార్కెట్లోకి తీసుకరాబోతుంది. ఈ కొత్త షియోమి ఎంఐ 6 స్మార్ట్ఫోన్ డ్యుయల్ ఎడ్జ్ కర్వ్డ్ స్క్రీన్తో రాబోతుందట. దీని ధర రూ. 19,800 నుంచి రూ. 29,800 వరకు ఉండనున్నట్లు సమాచారం.
* క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టమ్
*ఎంఐయూఐ 9
*128జీబీ, 256జీబీ స్టోరేజ్
* సోనీ ఐఎంఎక్స్362తో కూడిన 12 మెగాపిక్సెల్ వెనుక కెమెరాను ఈ ఫోన్లో అమర్చారట.