మిస్టరీగా మారిన క్రికెటర్ సురేష్ రైనా కుటుంబీకుల హత్య కేసు చిక్కుముడి వీడింది. హత్యకు పాల్పడిన వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టుపై స్పందించిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్సింగ్ కేసును పరిష్కరించినట్లు ప్రకటించారు.
పంజాబ్ డీజీపీ దిన్కర్ గుప్తా మాట్లాడుతూ.. 11 మంది సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా పంజాబ్, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్లో ఇలాంటి పలు ఘటనలకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. పంజాబ్లోని పఠాన్కోట్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో సంచరిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి కొంత బంగారం, హత్యలకు వాడిన కర్రలు, రూ.1530 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.