హెచ్‌ఆర్సీ కి శివ బాలాజీ ఫిర్యాదు .. కారణం అదే

కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ లో సినీనటుడు శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ మణికొండలోని మౌంట్‌ లీటేరాజీ పాఠశాల యాజమాన్యం ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లలను ఆన్‌లైన్‌ తరగతుల నుంచి తొలగించిందని ఆయన ఆరోపించారు.

 ఈ మేరకు హెచ్‌ఆర్సీకి ఆయన ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. పెంచిన పాఠశాల ఫీజులు తగ్గించాలని కోరితే.. తమకు ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లల్ని ఆన్‌లైన్‌ తరగతుల నుంచి తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు