ధోని భలే ఆట పట్టించాడు


మరో ఐదు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ కోసం అన్ని జట్లూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే అభిమానుల్లో ఐపీఎల్‌ ఫీవర్‌ మొదలవగా మ్యాచుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మూడుస్లారు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి టైటిల్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

ఐపీఎల్‌లో పాల్గొనేందుకు ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌’ జట్టు ఇప్పటికే చెన్నై చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిదంబరం స్టేడియంలో జరిగిన సరదా సన్నివేశం ధోనీ అభిమానులను తెగ సంబరపెడుతోంది. ధోనీ ప్రాక్టీస్‌ చేస్తుండగా ఓ అభిమాని సరాసరి మైదానంలోకి ప్రవేశించి ధోనీ వద్దకు పరిగెత్తాడు. అది గమనించిన ధోనీ అతడిని సరదాగా ఆటపట్టించాడు. అభిమాని అక్కడికి వచ్చేసరికి ధోనీ సీఎస్కే బౌలర్‌ లక్ష్మీపతి బాలాజీ వెనక్కి వెళ్లి ‘నన్ను పట్టుకో’ అన్నట్టు ఆటపట్టించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.