ఐపీఎల్ సీజన్-12 ..ధోని బోణీ కొట్టాడు

ఐపీఎల్ సీజన్-12 తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు వ్యూహం ఫలించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఇచ్చిన 70 పరుగుల లక్ష్యచేధన కోసం బ్యాటింగ్‎కు దిగిన చెన్నై17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 71 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్ల నష్టపోయి 17.4 ఓవర్లలో అలవోకగా ఛేదించింది. అంబటి రాయుడు (28 ) రాణించాడు. సురేశ్‌ రైనా (19; ), కేదార్‌ జాదవ్‌ (13 ), రవీంద్ర జడేజా (6; ) అజేయంగా నిలిచారు. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును చెన్నై బౌలర్లు భారీ దెబ్బకొట్టారు. ఇమ్రాన్ తాహిర్‌ (3/9), రవీంద్ర జడేజా (2/15), హర్భజన్‌ సింగ్‌ (3/20) రాణించారు. వీరి ధాటికి కోహ్లీసేన విలవిల్లాడింది.