ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లి తిరిగి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనుండగా, రోహిత్ శర్మను వైస్ కెప్టెన్గా నియమించారు. కేఎల్ రాహుల్కు కూడా ఈ జట్టులో స్థానం లభించింది. ఈ నెల 24 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. విశాఖపట్నం వేదికగా తొలి టీ20 ఉండనుంది. టీ20 సిరీస్ పూర్తయిన తర్వాత ఐదు వన్డేల సిరీస్ జరుగుతుంది.
టీ20 సిరీస్కు భారత జట్టు :
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ( వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్, యజ్వేంద్ర చహల్, బూమ్రా, ఉమేశ్ యాదవ్, సిద్దార్థ్ కౌల్, మయాంక్ మార్కండే
తొలి రెండు వన్డేలకు భారత జట్టు :
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదర్ జాదవ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, బూమ్రా, మహ్మద్ షమీ, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషభ్ పంత్, సిద్ధార్ద్ కౌల్, కేఎల్ రాహుల్