నిర్భయ హంతకులకు ఉరే సరి :రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

నిర్భయ హత్య కేసులో దోషి ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించారు. ముఖేశ్ క్షమాభిక్షను తిరస్కరించండంటూ కేంద్ర హోంశాఖ వర్గాలు శుక్రవారం ఉదయం రాష్ట్రపతికి విన్నవించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి నిందితుడి క్షమాభిక్షను తిరస్కరించినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సంచలన నిర్ణయంపై నిర్భయ తండ్రి స్పందించారు. ‘‘చాలా మంచి విషయం. ఉరిశిక్ష అమలు చేయడం ఆలస్యమవుతుందనే వార్త తమ ఆశలను ఆవిరి చేసింది’’ అని తండ్రి పేర్కొన్నారు.