తమిళనాడులో కరోనా జెట్ స్పీడ్


తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వేగంగా పెరుగుతుంది. నేటికి సంఖ్య 621కి చేరింది. ఇవాళ మరో 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్ మాట్లాడుతూ, ఈరోజు నమోదైన యాభై కేసులలో ఇద్దరు మినహాయించి మిగిలిన వ్యక్తులందరూ ఢిల్లీలో తబ్లిగీ జమాత్ కాన్ఫరెన్స్ కు హాజరైన వారేనని చెప్పారు.

రాష్ట్రంలో ‘కరోనా’ టెస్టింగ్ పరీక్షలను వేగవంతం చేసే నిమిత్తం చైనాకు ఒక లక్ష టెస్టింగ్ కిట్స్ ను ఆర్డర్ ఇచ్చినట్టు సీఎం పళనిస్వామి తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.500 కోట్ల ఆర్థికసాయం పొందినట్టు చెప్పారు. ఈ నెల 8వ తేదీ నాటికి టెస్టింగ్స్ కిట్స్ రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని అన్నారు.