శ్రీలంక బాంబు పేలుళ్లు.. జిహాదిల పనే !

లంక రాజధాని కొలంబోలో ఐసిన్ ఉగ్రవాదులు మారన హోమం సృష్టించిన సంగతి తెలిసిందే. కొలంబోని మూడు చర్చీలు, మూడు హోటల్లో ఆత్మహుతి దాడికి పాల్పడ్దారు. ఈ ఘటనలో 130మంది మృతి చెందారు. మరో 300మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులు ఐసిస్ ఆత్మాహూతి దళ సభ్యులు పనేనని తేలింది. ఈ మేరకు శ్రీలంక భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

జహ్రెయిన్ హుస్సేన్, అబు మొహమ్మద్ అనే ఉగ్రవాదులు రెండు ప్రాంతాల్లో ఆత్మాహూతి దాడులకు పాల్పడినట్లు అధికారులు ధృవీకరించారు. జిహాద్ పేరుతో దాడులు చేసినట్లు గుర్తించారు. దీంతో.. మిగితా నాలుగు చోట్ల ఇదే రకంగా ఉగ్రవాదులు తమని తాము పేల్చుకొని మారణకాండని సృష్టించి ఉంటారని భావిస్తున్నారు. రియాపై పట్టు కోల్పోయిన తరువాత ఐసిస్.. భారీ ఎత్తున మారణ హోమానికి పాల్పడటం ఇదే తొలిసారి.