ఆసీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత్ చారిత్రక విజయం నమోదు చేసింది అడిలైడ్ టెస్టులో ఆ జట్టుపై 31 పరుగుల తేడాతో చారిత్రక విజయం నమోదు చేసింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత కంగరూ గడ్డపై భారత్ తొలిసారిగా టెస్టు విజయాన్ని నమోదు చేసింది.
భారత్ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఆసీస్ 291 పరుగులకు ఆలౌటైంది.
ఒకానొక దశలో మ్యాచ్ ఆసీస్ పరం అవుతుందేమో అనిపించేలా ఆసీస్ భారీ షాట్లు బాదింది. అయితే చివర్లో అశ్విన్ మాయాజాలం మరోసారి పని చేసింది. మరో 31 పరుగులు చేయాల్సి ఉండగా అశ్విన్ 120వ ఓవర్లో హేజిల్వుడ్ వికెట్ తీశాడు. దీంతో ఆసీస్ 291 పరుగులకే ఆలౌట్ అయింది.
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 250
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 235
టీమిండియా రెండో ఇన్నింగ్స్: 307
ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 291