మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు హ్యాండ్స్ కోంబ్ 58, షను మార్ష్ 39, ఖవాజా 34, గ్లెన్ మాక్స్ వెల్ 26 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు చాహల్ 6 వికెట్లు, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ లు రెండు చొప్పున వికెట్లు తీశారు.
231 పరుగుల లక్ష్య ఛేదనలో ఎంఎస్ ధోనీ (87), కేదార్ జాదవ్ (61) అజేయంగా నిలిచారు. నాలుగో వికెట్కు వీరిద్దరూ 116 బంతుల్లో 121 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విరాట్ కోహ్లీ (46) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు రిచర్డ్ సన్, షడ్డీల్, స్టోయినిస్ ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకొంది.