సింధు కు శుభాకాంక్షలు తెలిపిన ప్రిన్స్..

చరిత్ర సృష్టించిన పీవీ సింధు కు శుభాకాంక్షలు తెలిపాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒకుహరతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-19, 21-17 తేడాతో పీవీ సింధు గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్బంగా ఆమెకు యావత్ ప్రజానీకం శుభాకాంక్షలు తెలుపుతుంది. క్రీడా, రాజకీయ నాయకులే కాదు సినీ తారలు సైతం ఆమెకు బెస్ట్ విషెష్ ను అందిస్తున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎంత అద్భుతమైన ఘనత!!! బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను గెలిచిన పీవీ సింధుకి అభినందనలు. నిన్ను చూసి యావత్తు దేశం గర్వపడుతోంది. నువ్వు మరిన్ని ఉన్నత స్థానాలను అందుకోవాలి’ అని ట్వీట్‌ చేసాడు.