జులై 05 తెలంగాణా రాష్ట్ర విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చారు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 5 న బంద్ కు పిలుపునిస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. ఈ మేరకు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (ఏఐఎ్సఎఫ్, ఎస్ఎ్ఫఐ, పీడీఎ్సయూ, ఏఐడీఎ్సవో, టీవీవీ, ఏఐఎ్ఫడీఎస్, ఏఐఎ్సబీ)ల ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు.
ఆదివారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్.శివరామకృష్ణ, కోట రమేష్ , ఎం.పరుశరాం, మద్దిలేటి, జీ.వంశీధర్రెడ్డి మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలలో నెలకొన్న మౌలిక సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు.