టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు

ఏపీ రాజకీయాలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వేడి పెరుగుతుంది..ఇప్పటికే తెలుగుదేశం , వైస్సార్సీపీ , జనసేన , బీజీపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం లో బిజీ అయ్యాయి. ఇక తెలుగుదేశం పార్టీ కి వరుస షాక్ లు మాత్రం బాబు ను చాల ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తుంది. ప్రచారం లో మీము గెలవడం ఈజీ అని..సంక్షేమ పథకాలే మాకు విజయాన్ని అందిస్తాయని..ఆడపడుచులు మమ్ములను గెలిపిస్తారని చంద్రబాబు బయటకు చెపుతున్న..లో లోపల మాత్రం బాబు కు భయం గట్టిగానే పట్టుకున్నట్లు తెలుస్తుంది.

ముఖ్యంగా పార్టీ ముఖ్య నేతలంతా వైస్సార్సీపీ , జనసేన పార్టీ లోకి జంప్ అవుతుండడం..టికెట్స్ విషయంలో నేతలు అసంతృప్తి గా ఉండడం..ఎంపీ టికెట్స్ ఇస్తామంటే మాకు వద్దు అని చెపుతుండడం..కొంతమంది టికెట్స్ విషయంలో ఆగ్రహంగా ఉంటె..మరికొంతమంది ప్రతిపక్ష పార్టీ నేతలు పెట్టె డబ్బు మీము పెట్టలేమని..అసలు గెలుస్తామో లేదో తెలియడం లేదు..ఇలాంటి సమయంలో కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకని..ఇలా ఎవరికీ వారే బాబు కు షాక్ లు ఇస్తున్నారట. దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారో వారి మాటల్లోనే వినండి.