అనూహ్య అనుమానాలు!

ANUHYA-DEATH-MYSTERYముంబాయిలో హత్యకు గురైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మురం చేశారు. ఆమె మృత దేహం లభించిన 16రోజుల తరవాత పోలీసులు ఈ కేసులో కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. జనవరి 5న కుర్లా రైల్వే స్టేషన్‌లో అనూహ్యతోపాటు మరో వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ద్వారా ఆ వ్యక్తి ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

అయితే, ఆ వ్యక్తి ఫోటోను అనూహ్య కుటుంబ సభ్యులకు చూపించగా.. అతనిని ఇదివరకేప్పుడు చూడలేదని చెప్పినట్లు తెలుస్తోంది. అనూహ్యతో వున్నది హైదరాబాద్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనూహ్య పక్కకు వున్న వ్యక్తిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా వారు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.