పాక్ లో ఉగ్రవాదుల భీభత్సం

Pakపాకిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాకిస్తాన్ లోని క్వెట్టాలో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండలో సామాన్య ప్రజలు విలవిలాడిపోయారు. బలుచిస్తాన్, ఖైబర్ – పక్తుంఖ్యా ప్రాంతాల్లో వరుసగా ఆరు చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ బాంబు దాడుల్లో 103 మంది దుర్మరణం చెందగా, దాదాపు 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లు జరిగిన చోట్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. షియా ముస్లింలు లక్ష్యంగా బాంబు దాడులు చేసినట్లు సమాచారం. లష్కర్ ఇ జంగ్వీ అనే ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు బాధ్యత ప్రకటించినట్లు తెలుస్తోంది.