జవాను మృతదేహంలో బాంబు

CRPF Jawanసీఆర్ పీఎఫ్ జవాను మృత దేహంలో మావోయిస్టులు బాంబు అమర్చారు. లతేహార్ లో సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ లో 10 సీఆర్ పీఏఫ్ జవాన్లు, ముగ్గురు పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ఆలస్యంగా బయటపడిన మూడు మృతదేహాలకు ఈరోజు పోస్ట్ మార్టమ్ కోసం రాంచీ ఆసుపత్రిలో తీసుకువచ్చారు. అయితే వైద్యులు మృత దేహాలకు శవ పరీక్ష చేస్తుండగా అందులో ఒక మృతదేహానికి కుట్లు ఉన్నట్లు గుర్తించారు. దాంతో అప్రమత్తమైన వైద్యులు ఎక్స్ రే తీసిచూడగా మృతదేహంలో బాంబు ఉన్నట్లు తెలిసింది. వెంటనే వైద్యులు బాంబు స్క్వాడ్ బృందానికి సమాచారం అందించగా వారు బాంబును నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. దీనిపై హోంమంత్రిత్వ శాఖ స్పందించిన స్పందింస్తూ.. మావోయిస్టులు అవలంభిస్తున్న మరో కొత్త టెక్నిక్ ఇదని అభిప్రాయపడింది.