మా కుమార్తెను భారత్ కు తీసుకురండి..


అమెరికాలో తన కుమార్తె దీనస్థితిలో ఉందని తిరిగి భారత్ కు తీసుకురావాలని ఓ తల్లి కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ కు రాసిన లేఖ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌కు చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అనే మహిళ ఉన్నత విద్య(మాస్టర్స్ డిగ్రీ) అమెరికాలో అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ అనుకోకుండా అనారోగ్యంతో దీనస్థితిలో చికాగోలోని ఓ వీధిలో కనిపించింది. దీంతో తన కుమార్తెను భారత్ కు తీసుకురావాలని ఆమె తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాసింది.

ఈ విషయాన్ని తెలంగాణ పార్టీ మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధికార ప్రతినిధి ఉల్లా ఖాన్ ట్వీటర్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. కొన్ని వస్తువులతో చికాగోలోని ఓ వీధిలో ఒక మూలలో కూర్చున్న మహిళ యొక్క వీడియోను ఖాన్ ట్విట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. అనారోగ్యంతో వున్న తను చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా రక్త నమూనాలను సేకరించిన తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆ మహిళ తెలిపింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. సానుభూతిని వ్యక్తం చేస్తూ భారత్ కు తీసుకురావాలని కోరుతున్నారు.