2018 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) గురువారం విడుదల చేసింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు .
సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 1994 మంది అభ్యర్థులు ఈ అత్యున్నత సర్వీసులకు ఎంపికైనట్లు ఫలితాలు ప్రకటించారు. అభ్యర్థులు upsc.gov.in, upsconline.nic.in వెబ్సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.
ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసెస్తో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)లో ఉద్యోగాల నియామకాల కోసం మెయిన్స్ పరీక్షను నిర్వహించారు. మెయిన్స్ పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి పర్సనాలిటీ టెస్ట్ లేక ఇంటర్వ్యూ నిర్వహిస్తామని కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.