భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరభ్ గంగూలీ ఇన్స్టాగ్రాం ‘sganguly99’ పేరిట ఉన్న ఖాతా నుంచి సోమవారం పలు పోస్టులు వచ్చాయి. వీటిపై మీడియాలోనూ పలు కథనాలు వచ్చాయి. ఇందులో సచిన్ కు నిద్రలో నడిచే అలవాటు ఉందని కూడా తెలిపారు. సచిన్ గురించి గంగూలీ చెబితే నమ్మకుండా ఎవరుంటారు ? అందరు నమ్మేశారు.
ఐతే, ఆ ఇన్స్టాగ్రాంలో ఖాతా తనది కాదని చెప్పి గంగూలీ షాక్ ఇచ్చారు. అందులో వచ్చే వ్యాఖ్యలను ఎవరూ పరిగణనలోకి తీసుకోవద్దని కూడా గంగూలీ చెప్పాడు. ‘ఇన్స్టాగ్రాంలో నా పేరు మీద ఉన్న ఖాతా నుంచి వచ్చిన పోస్టులు నేను చేసేవి కాదు. అసలు అది నా ఖాతా కాదు. ఫేక్ ఖాతా. దయచేసి అందులో వచ్చే వార్తలను తీసుకోకండి. ఇన్స్టాగ్రాం నిర్వాహకులకు త్వరలోనే ఫిర్యాదు చేస్తా’ అని గంగూలీ ట్విటర్లో పేర్కొన్నాడు.
ప్రస్తుతం గంగూలీ ఇంగ్లాండ్లో పర్యటిస్తున్నాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్కు గంగూలీ కామెంటేటర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.