వాంఖడే వన్డేలో భారత్ గెలుపు..


వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్ పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్యాన్ని టీమిండియా 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్యఛేదనలో టీమిండియా ఆరంభంలోనే తడబడంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (3), శుభమన్ గిల్ (20), విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (0) వరుసగా తక్కువ స్కోరుకే ఔటైపోగా.. కేఎల్ రాహుల్ (75 నాటౌట్: 91 బంతుల్లో 7×4, 1×6), రవీంద్ర జడేజా (45 నాటౌట్: 69 బంతుల్లో 5×4) కలిసి జట్టును గెలిపించారు. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 1 – 0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక రెండో వన్డే విశాఖపట్నం వేదికగా ఆదివారం జరగనుంది.