హడలెత్తించిన సిరాజ్.. ఆర్సీబీ ఘనవిజయం


మొహాలీలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 24 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు డుప్లెసిస్(56 బంతుల్లో 84), విరాట్ కోహ్లీ (47 బంతుల్లో 59) అర్థసెంచరీలతో రాణించారు. వీరిద్దరు మొదటి వికెట్‌కు 137 పరుగులు జోడించారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్, ఎల్లీస్‌కు ఒక్కో వికెట్ లభించింది.

ఇక లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రాన్ (30 బంతుల్లో 46), జితేష్ శర్మ (27 బంతుల్లో 41) రాణించారు. మిగతా బ్యాటర్లు చేతులేత్తేశారు. ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులిచ్చి.. నాలుగు వికెట్లు తీసుకున్నాడు. హసరంగా రెండు వికెట్లు తీయగా.. పార్నెల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.