దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) విచారణ జరిపింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న కమిషన్ ప్రతినిధులు మహబూబ్నగర్ నుంచి విచారణ మొదలుపెట్టారు. నిందితుల మృతదేహాలను పరిశీలించడంతో పాటు, వాళ్ల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ను రికార్డు చేశారు.
ఇప్పుడు హత్యాచార ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి పోలీసులు నివేదిక అందించారు. దిశ అపహరణ, అత్యాచారం, మృతదేహం కాల్చివేతపై నివేదికలో వివరాలు పొందుపరిచారు. మరోవైపు ఎన్కౌంటర్పై సిట్ బృందం విచారణ జరుపుతోంది. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో సిట్ సభ్యుల బృందం దర్యాప్తు ప్రారంభించింది.