పారాలింపిక్స్‌లో భారత్ కి తొలి పతకం

పారాలింపిక్స్‌లో భారత్ కి తొలి పతకం లభించింది. మహిళల టేబుల్‌ టెన్నిస్‌ ఫైనల్లో ఓడిన భవీనాబెన్‌ పటేల్‌ రజతం గెలిచింది. ఫైనల్లో నంబర్‌వన్‌ చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓడిపోయింది. అయితే పారాలింపిక్స్‌ చరిత్రలో టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కి పతకం దక్కడం ఇదే మొదటిసారి. పారాలింపిక్స్‌లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భవీనాబెన్‌ పటేల్‌ను అభినందించారు.