కోచిలో ప్రారంభమైన ప్రవాస భారతీయ దివస్

Pravasi-bhartiya-divas11వ ప్రవాస భారతీయ దినోత్వవం కోచిలో ఈ రోజు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను రేపు ప్రధాని మన్మోహన్ సింగ్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉత్సవాల్లో పాల్గొనడానికి 2000మంది వచ్చారని, తొలిసారిగా ప్రవాస భారతీయ దినోత్సవాల్లో మిడిల్ ఈస్ట్ మీద ప్రత్యేక చర్చ జరపబోతున్నామని మంత్రి కేసీ జోసెఫ్ తెలిపారు. ఒక రోజంతా జరిగే ఈ ప్రత్యేక చర్చకు కేంద్రమంత్రి వాయలార్ రవి, కేరళ ముఖ్యమంత్రి వూమెన్ చాందీ హాజరవుతారన్నారు.