’భారతరత్నా’లు ప్రధానం నేడే!!

sachinదేశ అత్యన్నత పౌరపురస్కారం ’భారతరత్న’ ప్రధానం ఈరోజు (మంగళవారం) జరగనుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ రావుల ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా సచిన్, ఏఎన్ రావులకు ఇటీవలే భారత ప్రభుత్వం భారతరత్నను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, సోమవారం కేంద్ర హోంశాఖ భారతరత్నపై  మార్గదర్శకాలను జారీచేసింది.