ఉదయం యాదాద్రి, సాయంకాలం వేంకటాద్రిని దర్శించుకున్న పురాణపండ

ప్రముఖ రచయిత , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్వ గౌరవ సంపాదకులు , శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఈరోజు ఉదయం , సాయంకాలం ఒకేరోజు రెండు మహాక్షేత్రాల దర్శనం చేసుకున్నారు.

ఈ ఉదయం తెల్లవారుఝామువేళ తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహ భగవానుని , ఈ సాయంకాలవేళ ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని వేంకటాద్రిపై కొలువుతీరి కరుణిస్తున్న శ్రీనివాసుని ప్రత్యేక దర్శనాలు చేసుకుని … వేదపండితుల ఆశీర్వచనాలు పొందటం విశేషం.

పురాణపండ శ్రీనివాస్ అనగానే మన కన్నుల ముందు అనేక అత్యద్భుత గ్రంధాలు, అపురూపమైన సుందర భాషా సంస్కారం , విశేషమైన నిస్వార్ధ ధార్మిక సేవ, పదిమందికీ మేలు చేసే గుణం ప్రత్యక్షంగా దర్శనమిస్తాయని అనేక ఆలయాల ప్రముఖులు బాహాటంగా చెబుతుంటారు.

తిరుమల , తిరుచానూరు దర్శనానంతరం పురాణపండ తిరుమల శ్రీవారికి మొక్కుగా తలనీలాలు సమర్పించుకున్నారు.

తిరుమల వేదపాఠశాల మొదలుగా తిరుమల వేదవిశ్వవిద్యాలయం వరకూ గల అనేక వైదిక బద్ధమైన టి.టి.డి అనేక విభాగాలలో శ్రీనివాస్ గ్రంధాలకు అభిమానులు వందల సంఖ్యలో దర్శనమివ్వడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.