టీ20 ప్రపంచకప్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ కు చోటు

త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో యువ ఆటగాడు శార్దూల్ ఠాకూర్‌కి చోటు దక్కింది. గాయపడ్డ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అక్షర్‌ను స్టాండ్‌ బై ఆటగాళ్ల జాబితాలో ఉంచింది.

టీ20 ప్రపంచకప్‌ జట్టు :
విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌),రోహిత్‌ శర్మ(వైస్‌-కెప్టెన్‌),కేఎల్‌ రాహుల్‌,సూర్యకుమార్‌ యాదవ్‌,రిషభ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, హర్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్ ఠాకూర్‌,వరుణ్‌ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్,మహమ్మద్‌ షమి.

స్టాండ్-బై ఆటగాళ్లు : శ్రేయస్‌ అయ్యర్, దీపక్‌ చాహర్‌, అక్షర్ పటేల్‌