స్వల్ప నష్టాలలో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపు లాభాల్లో పయనించినప్పటికీ.. తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 62 పాయింట్లు నష్టపోయి 60,073.48 వద్ద నిఫ్టీ 14.05 పాయింట్ల నష్టంతో 17,931 వద్ద కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.43 వద్ద ట్రేడవుతోంది.