రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వో పరీక్షా ప్రారంభం

vroఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న వీఆర్వో ఉద్యోగాల ఎంపిక పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. అనంతపురంలో పరీక్షను నిర్వహిస్తున్న ఆర్ట్స్ కళాశాలకు వెళ్లి రెవిన్యూ మంత్రి రఘువీరారెడ్డి వెళ్లి తనిఖీ చేశారు. 25 వేల మంది పోలీసులతో రాష్ట్రంలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీఆర్వో ఉద్యోగానికి 13,49,244 మంది, వీఆర్ఏ ఉద్యోగానికి 1,00,575 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేశారు. వీఆర్వో పరీక్షను 3684 కేంద్రాల్లో, వీఆర్ఏ పరీక్షను 195 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు.