కేజ్రీవాల్‌ చెంప పగిలింది..

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ చెంప పగిలింది.. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌పై ఓ యువకుడు దాడి చేసిన ఘటన అందరికి షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని మోతీనగర్ ప్రాంతంలో కేజ్రీవాల్.. శనివారం (మే 4) సాయంత్రం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఓ యువకుడు సడెన్ గా వచ్చి కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించాడు. ఆ దాటికి కేజ్రీవాల్ వెనక్కి వాలిపోయారు. ఒక్కసారిగా జరిగిన పరిణామానికి ఆయనతో పాటు వాహనంపై ఉన్న నేతలంతా షాక్‌కు గురయ్యారు. దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది, కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి ఎవరు, ఎందు కోసం ఇలా చేశాడని పోలీసులు విచారిస్తున్నారు.