ఈరోజే ఆఖరి పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఆఖరి ఏడో పోలింగ్ మొదలు అయ్యింది. ఇప్పటికే ఆరు విడతలుగా పోలింగ్ నిర్వహించగా… ఇవాళ తుది ఘట్టమైన ఏడో విడత పోలింగ్ ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీచేస్తున్న వారణాసి సహా దేశంలోని ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో విస్తరించిన 59 నియోజకవర్గాల్లోని ఓటర్లు ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ స్థానాల నుంచి 918 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పశ్చిమబెంగాల్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అదనపు బలగాలను మోహరింపజేస్తున్నారు.

పోలింగ్‌ జరిగే రాష్ట్రాలు 7 , కేంద్రపాలిత ప్రాంతం 1, నియోజకవర్గాల సంఖ్య 59, ఓటర్ల సంఖ్య 10,01,75,153, వీరిలో పురుషులు 5,27,14,890, స్త్రీలు 4,74,56,828, ఇతరులు3,435.. తుది దశ ఎన్నికల్లో పోలింగ్‌ కోసం 1,12,993 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు. పోటీలో ఉన్న అభ్యర్థులు 918 మంది.