ప్రైవేటు టెలికాం సంస్థలతో పోటీ పడేందుకు ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్తో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది..ఇప్పటికే డేటా ఆఫర్స్ ప్రకటించి కస్టమర్లను ఆకర్షించిన బీఎస్ఎన్ఎల్ , తాజాగా ల్యాండ్లైన్ కస్టమర్ల సంఖ్య మరింత పెంచుకునేందుకు మరో సూపర్ ఆఫర్ ప్రకటించింది.
ప్రతి ఆదివారంతో పాటు రోజూ రాత్రిళ్లు 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ల్యాండ్ఫోన్ నుంచి ఏ నెట్వర్క్కు అయినా అపరిమిత కాల్స్ చేసుకునేందుకు రూ.49 రీఛార్జ్ చేస్తే సరిపోతుందని ప్రకటించింది. గతంలో ఈ ఆఫర్ కు రూ. 99 రీఛార్జ్ ఉండేది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ ఆఫర్ ప్రకటించామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. 6 నెలలు ఈ ఛార్జీ అమలవుతుందని తెలిపింది.