ప్రవైట్ టెలికం సంస్థల తో పోటీ పడుతుంది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ..తాజాగా 3జీ మొబైల్ నెట్ ఛార్జీలను బిఎస్ఎన్ఎల్ భారీగా తగ్గించి కస్టమర్లకు ఊరట కలిగించింది. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.36కే 28రోజుల కాలపరిమితితో 1జీబీ డేటా అందిస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే రూ.291తో రీఛార్జి చేసుకుంటే ఇప్పటివరకు 2జీబీ డేటా లభిస్తుండగా, ఇకపై 8జీబీ డేటా వినియోగించుకోవచ్చని ప్రకటించింది. వినియోగదారులకు తక్కువ ధరకే డాటాను అందించాలనే ఉద్దేశంతో వీటిని అందిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ పేర్కొంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 6 నుంచి అమలయ్యేలా మూడు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టింది.
* రూ.36 లకు 1 జీబీ
* రూ.291 ప్లాన్ లో 8జీబీ 3జీసేవలు, 28 రోజుల వాలిడిటీ. గతంలో ఇది 2జీబీ మాత్రమే.
* రూ. 78 ప్లాన్ లో 2జీబీ 3జీసేవలు, 28 రోజుల వాలిడిటీ.