ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సంస్థ లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కలిపిస్తున్నట్లు ప్రకటించింది. స్నాప్డీల్ తన సంస్థలోని ఉద్యోగులకు పింక్స్లిప్లు ఇస్తున్న నేపథ్యం లో ఫ్లిప్కార్ట్ ఉద్యోగుల సంఖ్య పెంచేందుకు ప్లాన్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్కు భారతమార్కెట్లో ప్రధాన పోటీదారుగా అమెజాన్ ఉన్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగులను పెంచడం ద్వారా సంస్థ మరింత వృద్ధిపథంలోకి వెళ్ళేతుందని ఆలోచిస్తున్నారు.
తాజా గణాంకాల ప్రకారం ఫ్లిప్కార్ట్ గతేడాది 1,500మందిని నియమించింది. ఇప్పటికే సంస్థలో తాత్కాలికంగా 10వేల మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ , విజయవాడ , వైజాగ్ , వరంగల్ వంటి నగరాల్లోనే కాకుండా కొత్తగా ఏర్పడిన తెలంగాణ జిల్లాలో కూడా ఫ్లిప్కార్ట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది.