రిలయన్స్ జియో తమ కస్టమర్లకు మరో తీపి కబురు తెలిపి సంతోషాన్ని నిలిపింది. మార్చి 31 తో జియో ఉచిత సేవలు ముగియనున్న నేపథ్యం లో ప్రైమ్ మెంబర్షిప్ పేరుతో పలు ఆఫర్లు ప్రకటించిన జియో , తాజాగా బై వన్ గెట్ వన్ ఫ్రీ రీచార్జ్ ఆఫర్ ను ప్రకటించింది.
మార్చి 31లోగా ప్రైమ్ మెంబర్షిప్ కోసం రిజిస్టర్ చేసుకునే కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ప్రైమ్ మెంబర్షిప్ కింద రూ.303తో రీచార్జ్ చేసుకుంటే ఇప్పుడున్న 28 జీబీ డేటాకు అదనంగా మరో 5 జీబీ ఉచిత డేటా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇది రూ.201 బూస్టర్ ప్యాక్తో సమానమని చెప్పిన జియో.. దీన్ని పూర్తిగా ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అలాగే రూ.499తో రీచార్జ్ చేసుకుంటే 10 జీబీ 4జీ డేటాను అదనంగా ఇస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న జియో , రానున్న రోజుల్లో మరిన్ని ఆఫర్స్ తో కస్టమర్లను ఆకట్టుకో బోతుందని సంస్థ తెలిపింది. జియో దెబ్బకు మిగతా టెలికం సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. మరోపక్క నోకియాతో ఎయిర్ టెల్ ఒప్పందం చేసుకుంది. ఈ రెండింటి మధ్య 5G సేవల ఒప్పందం కుదిరింది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నోకియాతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది.