జియో వన్ ప్లస్ వన్ ఆఫర్ ని చూసారా..?

jio-new-offers

రిల‌య‌న్స్ జియో తమ కస్టమర్లకు మరో తీపి కబురు తెలిపి సంతోషాన్ని నిలిపింది. మార్చి 31 తో జియో ఉచిత సేవలు ముగియనున్న నేపథ్యం లో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ పేరుతో ప‌లు ఆఫ‌ర్లు ప్ర‌క‌టించిన జియో , తాజాగా బై వ‌న్ గెట్ వ‌న్ ఫ్రీ రీచార్జ్ ఆఫర్ ను ప్రకటించింది.

మార్చి 31లోగా ప్రైమ్ మెంబ‌ర్షిప్ కోసం రిజిస్ట‌ర్ చేసుకునే క‌స్ట‌మ‌ర్ల‌కు ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. ప్రైమ్ మెంబ‌ర్షిప్ కింద రూ.303తో రీచార్జ్ చేసుకుంటే ఇప్పుడున్న 28 జీబీ డేటాకు అద‌నంగా మరో 5 జీబీ ఉచిత డేటా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. ఇది రూ.201 బూస్ట‌ర్ ప్యాక్‌తో స‌మాన‌మ‌ని చెప్పిన జియో.. దీన్ని పూర్తిగా ఉచితంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అలాగే రూ.499తో రీచార్జ్ చేసుకుంటే 10 జీబీ 4జీ డేటాను అద‌నంగా ఇస్తున్నట్లు తెలిపింది.

jio-1+1

ఇప్పటికే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న జియో , రానున్న రోజుల్లో మరిన్ని ఆఫర్స్ తో కస్టమర్లను ఆకట్టుకో బోతుందని సంస్థ తెలిపింది. జియో దెబ్బకు మిగతా టెలికం సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. మరోపక్క నోకియాతో ఎయిర్ టెల్ ఒప్పందం చేసుకుంది. ఈ రెండింటి మధ్య 5G సేవల ఒప్పందం కుదిరింది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నోకియాతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది.