టెలికం రంగాన్ని ఓ ఊపుఊపేస్తున్న రిలయన్స్ జియో, తాజాగా మరో సంచలనానికి తెరలేపింది. ఇప్పటివరకు ఉచిత వాయిస్, డేటా కాల్స్తో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్న జియో , మరింత మంది వినియోగదారులను ఆకట్టుకునేందుకు 4జీ వోల్ట్ (వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్) సదుపాయం ఉన్న ఫీచర్ఫోన్లను అత్యంత తక్కువ ధరకే విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయబోతుంది.. రూ.999 నుంచి రూ.1500 మధ్యలో రెండు 4జీ వోల్ట్ ఫోన్లను తయారు చేయబోతుంది.
అందుతున్న సమాచారం ప్రకారం ..ముందు, వెనుక కెమెరాలతో ఈ రెండు ఫీచర్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఆ ఫీచర్ఫోన్లలో రిలయన్స్ జియో చాట్, లైవ్ టీవీ, జియో మనీ యాప్స్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఈ ఫోన్లు ఎప్పుడు వస్తాయనేది ఇంకా తెలియాల్సి ఉంది.