ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్..తాజాగా తన సంస్థ నుండి మరో సరికొత్త మోడల్ మెర్సిడెస్-మేబ్యాష్ జీ 650 లాండాలెట్స్ రూపొందించింది. ప్రపంచంలోనే అత్యధిక ధర గల ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయబోతుంది. ఈ ఎస్యూవీని జెనీవా ఆటో షోలో ప్రదర్శనకు ఉంచింది.
దీని ధర ను సుమారు రూ. 3.3కోట్లు గా తెలిపింది. ఎస్యూవీల్లో అత్యధిక ధర గల మోడల్ ఇదే అని తెలుస్తుంది. కాకపోతే మిగతా మోడల్స్ మాదిరిగా చాల తయారు చేయకుండా కేవలం 99 మాత్రమే ఉత్పత్తి చేయనుందట. సరికొత్త ఫీచర్లు, అధునాతన టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. వెనుకవైపున ప్రతి సీటు ముందు 10 అంగుళాల స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ తర్వాత ఈ ఎస్యూవీని మార్కెట్లోకి తీసుకరాబోతున్నారు.