ప్రముఖ ఆటో దిగ్గజం నిస్సాన్ తన మిడ్ సెజ్ సెడాన్ సన్నీలో కొత్త మోడల్ కారును మార్కెట్లో లంచ్ చేసింది. దీని ధరను రూ.7.91 లక్షల(ఎక్స్-షోరూం ఢిల్లీ ) ప్రారంభ ధరతో ఈ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కార్ పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో నిస్సాన్ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.
పెట్రోల్ వెర్షన్ యూ వస్తే.. 1,498సీసీ ఇంజిన్, డీజిల్ వేరియంట్ 1,461 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉంది. పెట్రోల్ ఆప్షన్ ధర రూ.7.91 లక్షల నుంచి రూ.10.89 లక్షల మధ్య ఉండగా.. డీజిల్ వేరియంట్ ధరలు రూ.8.8 లక్షల నుంచి రూ.10.76 లక్షల మధ్య ఉంది.
దీని ప్రత్యేకతలు చూస్తే ..
* యాంటీ లాక్ బ్రేకింగ్(ఏబీఎస్)
* ఎలక్ట్రిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(ఈబీడీ),
* బ్రేక్ అసిస్ట్(బీఏ)
* డ్యూయల్ ఫ్రంట్, సైడ్ ఎయిర్బ్యాగ్స్ దీనిలోని సేఫ్టీ ఫీచర్లు.