సంక్రాంతి కానుకగా మొబైల్ ప్రియులకు తీపి కబురు అందించింది చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ . ఈ సంస్థ నుండి వచ్చిన ‘రెడ్మీ 6’ స్మార్ట్ఫోన్ ధరను తగ్గించింది. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.500 తగ్గించింది. తగ్గిన ధరత్తో ఈ ఫోన్ రూ.7,999 లకే అందుబాటులో ఉంది. అలాగే 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను కూడా రూ.500 తగ్గించడంతో.. రూ.8,999 ధరకే లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ను కొనుగోలు చేసి పండుగను మర్నీత జోష్ గా గడుపుకోండి.
ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే..
* 5.45 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
* మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
* 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఫేస్ అన్లాక్
* ఫింగర్ ప్రింట్ సెన్సార్