భారత మొబైల్ మార్కెట్లో చైనా కంపెనీ షియోమి మొబైల్స్ హావ కొనసాగిస్తున్నాయి..ఇప్పటికే షియోమి నుండి వచ్చిన అన్ని మోడల్స్ తెగ అమ్ముడవుతూ సంస్థ కు లాభాలు తెచ్చిపెడుతున్నాయి..దీంతో షియోమి మరిన్ని మోడల్స్ ను భారత మార్కెట్లోకి తీసుకరాబోతుంది. ఇప్పటికే రెడీమి , రెడీమి నోట్ , రెడీమి నోట్ 4 వంటి మోడల్స్ వాటి హవాను కొనసాగిస్తుంటే, తాజాగా రెడీమి నోట్ 4 కి కొనసాగింపుగా నోట్ 4ఎక్స్ ను విడుదల చేయనుంది.
ఫిబ్రవరి 14న ఈ కొత్త స్మార్ట్ఫోన్ను చైనాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రెడ్మి నోట్ 4ఎక్స్ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీని ఫీచర్లను చూస్తే..
* 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
* 2జీబీ, 3జీబీ, 4జీబీ ర్యామ్
* 16జీబీ, 32జీబీ, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లు నోట్ 4ఎక్స్
* 13 ఎంపీ వెనుక కెమెరా, సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఆపరేటింగ్ సిస్టమ్
* ఇక ఈ ఫోన్స్ గోల్డ్, సిల్వర్, గ్రే రంగుల్లో లభించనుంది.