బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలెకు దగ్గర పడుతున్న సమయంలో మూడు రోజులుగా హీటెక్కిన బిగ్ బాస్ హౌజ్ ఒక్కసారిగా ఎపిసోడ్ 103 రోజు కాస్త చల్లబడినట్టు కనిపించింది. మొన్న మీ ఇసుక జాగ్రత టాస్క్ లో గెలిచినా రోల్ రైడ , సామ్రాట్ లకు లెవెల్ 2 టాస్క్ లో భాగంగా మీ గుడ్డు జాగ్రత్త అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఎవరి దగ్గరైతే ఎక్కవ గుడ్లు ఉంటాయో వారు నేరుగా ఫినాలెకు చేరుకున్న మొదటి ఇంటి సభ్యుడు అవుతారు అని బిగ్ బాస్ చెప్పాడు.
టాస్క్లో భాగంగా మిగతా ఇంటి సభ్యులు ఒకరికి మద్దతు తెలుపుతూ మరొకరివి పగలగొట్టొచ్చని అన్నారు. టాస్క్ ప్రారంభం కాగానే రోల్, సామ్రాట్లు జైలులోకి వెళ్ళి తాళం వేసుకున్నారు. బిగ్ బాస్ హెచ్చరికలతో బయటకి వచ్చారు. రోల్ కిచెన్ రూంలో ఉన్న కప్ బోర్డ్స్లో దాక్కుంటే సామ్రాట్ స్విమ్మింగ్ పూల్ కార్నర్లో నిలుచొని తనకి ఇచ్చిన ఎగ్స్ కాపాడుకున్నాడు.
అయితే రోల్కి కౌశల్ ఒక్కడే సపోర్ట్ చేస్తే మిగతా ఇంటి సభ్యులు సామ్రాట్ కి సపోర్ట్ గా నిలిచారు. అయితే బిగ్ బాస్ కిచెన్ కప్ బోర్డ్స్లో దాక్కున్నా రోల్ ను సామ్రాట్ లాగా గార్డెన్ ఏరియాలోకి వచ్చి గేమ్ ఆడమన్నాడు. అయితే రోల్ కప్ బోర్డ్స్లో నుంచి బయటకి వస్తున్న క్రమంలో, రోల్ దగ్గర ఉన్న గుడ్లని పగలగొట్టేందుకు తనీష్, గీతా, దీప్తిలు చాలా ప్రయత్నించగా కొంత వరకు వారిని కౌశల్ అడ్డుకున్నాడు. కాని బెడ్ రూంలోకి వెళ్ళిన తర్వాత అందరు ఒకే సారి రోల్పై ఎటాక్ చేయడంతో ఆయన చేతిలో ఉన్న గుడ్లు అన్ని పగిలిపోయాయి.
దీంతో రోల్, కౌశల్ సామ్రాట్ దగ్గర ఉన్న గుడ్లను కూడా పగలగొట్టడానికి ప్రయత్నిస్తుండగా గీత, తనీష్ లు కౌశల్ అడ్డుకున్నారు. బిగ్ బాస్ ఆదేశం మేరకు తనీష్ కౌశల్ ని వదిలేయమని చెప్పగానే గీత, దీప్తిలు కౌశల్ ను అడ్డుకున్నారు. బాగా అలసిపోయిన రోల్ చివరి వరకు పోరాడదామని కౌశల్ అంటున్న కూడా తన గుడ్లు ఎలాగూ కింద పడిపోయాయి కాబట్టి సామ్రాట్ గుడ్లును పగలగొట్టలేమని.. అతన్నే విన్ కానివ్వమంటూ చేతులెత్తేశాడు రోల్ రైడా. నీకు సపోర్ట్ చేస్తూ ఇంత రిస్క్ చేస్తే నువ్వు ఇలా అనడం ఏం బాలేదు అని కౌశల్ అన్నాడు. నీకు సామ్రాట్ గెలవాలని ఉందని చెపితే నేను డ్రాప్ అవుతానని కౌశల్, రోల్ ను అడగగా తను తప్పుకున్నట్లు ఒకే అన్నాడు.
దీంతో కౌశల్ డ్రాప్ కాగా, సామ్రాట్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అందరిని హగ్ చేసుకొని కన్నీటి పర్యంతం అయ్యాడు సామ్రాట్. టైటిల్ రాకపోయిన పర్వాలేదు. అక్కడి వరకు చేరుకున్నందుకు సంతోషంగా ఉందని సామ్రాట్ స్పష్టం చేశాడు.
ఆ తరువాత బిగ్ బాస్ హెయిర్ ఫ్రీజ్ గురించి టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇంటి సభ్యులు మూడు గ్రూపులగా విడిపోయి ప్రకటన చేయాలని అన్నారు. ఈ ప్రకటన ఫన్నీగా ఉండాలని అన్నారు. విడిపోయిన గ్రూపులో ఏ గ్రూప్ ప్రకటన అయితే బాగుంటుందో వారికీ ప్రకటన కోసం వాడిన వస్తువులని వారి ఇంటికి కూడా పంపిస్తామని తెలిపారు. కౌశల్, గీతా మాధురిలు ప్రకటన కోసం భార్య భర్తలుగా మారి స్కిట్ని రక్తి కట్టించారు. దీంతో వారిద్దరిని బిగ్ బాస్ టాస్క్ విజేతలుగా ప్రకటించారు.