బిగ్ బాస్ సభ్యులకు పెద్ద షాక్ ఇచ్చిన బిగ్ బాస్..

బిగ్ బాస్ సీజన్ మరో రెండు వారాల్లో పూర్తి అవుతుంది..ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉండడం తో టైటిల్ విజేత ఎవరు అవుతారో అనే ఆసక్తి అందరిలో పెరుగుతుంది. ప్రతి వారం లాగానే సోమవారం ఎలిమినేష‌న్ రౌండ్ జరిగింది. కానీ ప్రతి వారం కొంతమంది మాత్రమే ఎలిమినేష‌న్ అవ్వడం మనం చూసాం. కానీ ఈ వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ సబ్యులకు షాక్ ఇచ్చాడు. రూల్స్ ను పాటించ‌ని కారణం చేత హౌస్ మేట్స్ అంద‌రిని ఎలిమినేష‌న్ రౌండ్ కు నామినేట్ చేసాడు.

ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ లేకుండా గేమ్ కొనసాగడం జరగలేదు. కానీ ఈ సారి రెండు వారాల పాటు కెప్టెన్ లేకుండా గేమ్ కొన‌సాగిస్తున్న‌ట్లుగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు బిగ్ బాస్‌. హౌస్ మేట్స్ ఎవ‌రూ హౌస్ రూల్స్ ను పాటించ‌టం లేద‌ని తీవ్ర‌స్థాయిలో మండిప‌డిన బిగ్ బాస్‌.. తాను చెప్పే ప్ర‌తి ప‌ని వెనుక బ‌ల‌మైన కార‌ణం ఉంటుంద‌న్నాడు. ఆ విష‌యాన్ని ఎవ‌రూ అర్థం చేసుకోవ‌టం లేద‌న్న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.

ఇక వందో ఎపిసోడ్ హైలైట్స్ విష‌యానికి వ‌స్తే హౌజ్‌లో త‌నీష్‌, కౌశ‌ల్ మ‌ధ్య బంధం గురించి కాసేపు డిస్క‌ష‌న్ జ‌రిగింది. బంధాలు ఉంటే గేమ్ స‌రిగా ఆడ‌లేమ‌ని కౌశ‌ల్ చెప్ప‌గా, నేను గేమ్ వ‌ర‌కు మాత్ర‌మే ఆ బంధాల‌కి వ్య‌తిరేఖం అని తనీష్ అన్నాడు. గీతా మాధురి.. రోల్‌ని పిలిచి చెవిలో గుస‌గుస‌లాడుతుఉండ‌గా, బిగ్ బాస్ గీతాకి వార్నింగ్ ఇచ్చారు. బాగ్ బాస్ ఇంటి స‌భ్యులకి స‌రికొత్త టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో భాగంగా రిపోర్టర్, ఫోటోగ్రాఫర్‌లు బిగ్ బాస్ హౌస్‌లో జరుగుతున్న స్టోరీలను కవర్ చేయాలని.. వారు కవర్ చేసిన స్టోరీలను తరువాత ప్లే చేసి చూపిస్తామని.. అప్పుడు ఆ స్టోరీ వివరాలను తెలియజేయాల్సి ఉంటుందన్నారు. మొత్తం మీద ఈ రెండు వారాల్లో బిగ్ బాస్ లో ఏం జరగబోతుందో అనే ఆసక్తి మాత్రం అందరిలో పెరిగింది.